కుటుంబంలో ఒకరికి ఉద్యోగం: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హామీ
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. అంజయ్య కుటుంబం మంగళవారం మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలుసుకొన్నది. అంజయ్య ఎంతో సమర్థ అధికారి అని, అదనపు కలెక్టర్గా తన బాధ్యతలను అద్భుతంగా నిర్వహించారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కొనియాడారు. అంజయ్య కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించటంతోపాటు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.