వనపర్తి, మే 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డిది రాజకీయ హత్యేనని, మంత్రి జూపల్లి దీనికి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జూపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. గులాబీ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, హత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కార్యకర్తలను తామే రక్షించుకుంటామని పేర్కొన్నారు. హత్యకు గురైన బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గడచిన ఐదు నెలల్లో ఎన్నో హత్యలు జరిగాయని తెలిపారు. రేవంత్రెడ్డి అసమర్థ పాలనకు ఇది నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో శ్రీధర్రెడ్డిది రెండో హత్య అని గుర్తుచేశారు. కొల్లాపూర్ను జ్యుడీషియల్ ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. 80 ఏండ్లు పైబడిని శ్రీధర్రెడ్డి తండ్రి శేఖర్రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హత్యలో మంత్రి జూపల్లి ప్రమేయం ఉందని పేర్కొన్నారని, అలా చెప్పడంతో పోలీసులు తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పడం చూస్తుంటే మనసు తరక్కుపోతున్నదని పేర్కొన్నారు. ప్రజాపాలన పేరుకేనని, అడుగడుగునా ప్రతీకార చర్యలు, హత్యలు జరుగుతుంటే ఎంతోకాలం చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. తెలంగాణకు హత్యల సంస్కృతి సరికాదని, పదేండ్లు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఆరు నెలలు కూడా దాటని రేవంత్ పాలన అరాచకాలకు కేరాఫ్గా మారిందని విమర్శించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే జరుగుతున్న హత్యలపై ప్రత్యేక జ్యుడీషియల్ టీంతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. హత్యలకు ఫుల్స్టాఫ్ పెట్టకుంటే వారి ఇండ్లను ముట్టడించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
బొడ్డు శ్రీధర్రెడ్డి హత్యపై సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండా ఈ హత్య జరగలేదని, ఎవరిని కదలించినా సంకోచం లేకుండా ఈ విషయాన్ని చెబుతారని పేర్కొన్నారు. ముమ్మాటికీ రాజకీయ కుట్ర ద్వారానే ఈ హత్య జరిగిందని తెగేసి చెప్పారు. సమాచారం తెలిసిన వెంటనే వందల కిలోమీటర్ల దూరం నుంచి తమ నాయకుడు కేటీఆర్ తరలిరావడం బాధిత కుటుంబం, బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొండంత ధైర్యాన్ని నింపిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ హత్యా రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం అండతోనే దాడు లు, హత్యలు జరుగుతున్నాయని, ఇటీవలే తాము రాష్ట్ర పోలీసు అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. దాడులకు ప్రతిదాడులు త మ సంస్కృతి కాదని, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడబోమని తేల్చి చెప్పారు.
వనపర్తి, మే 23 : బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డిది రాజకీయ ప్రేరేపిత హత్య అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఓ ప్రకటనలో ఆరోపించారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ మండల నేత శ్రీధర్రెడ్డి హత్యకు గురవడంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు. ఐదు నెలల కాలంలోనే ఇద్దరు గులాబీ పార్టీ నాయకులు హత్యకు గురికావడడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో పదేండ్ల కాలంలో ఒక్క హింసాత్మక చర్యగానీ, హత్యలు గానీ చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. గతంలో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా పాలన చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో రాజకీయ ద్వేషాలను వ్యక్తిగత ద్వేషాలుగా తీసుకొని దాడులకు తెగబడుతున్నదని ధ్వజమెత్తారు. గతంలో గంట్రావ్పల్లిలో మల్లేశ్ యాదవ్ను, బుధవారం శ్రీధర్రెడ్డిని గొడ్డళ్లతో నరికి చంపడం హేయమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హత్యలకు తావు లే దని, పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని, అండగా ఉంటామని భ రోసా కల్పించారు. శ్రీధర్రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హత్య ఘటనపై సమగ్ర విచారణ చేసి అరెస్టు చేయాలని ఫోన్లో ఎస్పీని కోరినట్టు వివరించారు.