హైదరాబాద్: చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పెద్ద రాష్ట్రాలలో రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అయినా కేసీఆర్ ఏం చేశారని మీడియా, ప్రతిపక్షాలు అంటున్నాయని విమర్శించారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
‘రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో పెద్ద రాష్ట్రాలలో దేశం లోనే తెలంగాణ నంబర్ వన్. అయినా ఏమి చెసినవ్ కేసిఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి.. చేరిపెస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి. జై తెలంగాణ!’ అంటూ ట్వీట్ చేశారు.
₹ 3.09 లక్షల తలసరి ఆదాయం తో పెద్ద రాష్ట్రాల లో దేశం లోనే తెలంగాణ No -1.
అయినా ఏమి చెసినవ్ కేసిఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి..
చేరిపెస్తే చెరగని సత్యం కేసిఆర్ గారు సాధించిన ఆర్థిక ప్రగతి.
జై తెలంగాణ! pic.twitter.com/JkIqzxqyMM
— KTR (@KTRBRS) April 1, 2024