హైదరాబాద్: అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారని చెప్పారు. వందశాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా ప్రభుత్వం తోక ముడిచిందని మండిపడ్డారు. రుణమాఫీ కానీ రైతన్నలకు సర్కార్ ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.
రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకన్నారు. పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి, అడవుల తల్లి ఆదిలాబాద్కు రా పోదామని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ధనోరా రోడ్డు మీద కూసున్న రైతుల ముందే మీ మాయల మాఫీ లెక్కలు తేల్చుదామన్నారు. రుణమాఫీ మాయ, రైతుభరోసా రూ.7500, తులం బంగారం, మహిళలకు రూ.2500 , ఆసరా పింఛన్లు రూ.4 వేలు , దివ్యాంగుల ఫించన్లు రూ.6 వేలు అంతా మాయ అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు.
అధికారం ఉందని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబితే నిజమవుతాయా ?
రుణమాఫీ కాలేదని రైతన్నలు ఇంకా రోడ్డెక్కుతున్నారు
వందశాతం రుణమాఫీ నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని శాసనసభ సాక్షిగా సవాల్ విసిరితే స్వీకరించకుండా తోక ముడిచిన ప్రభుత్వం .. రుణమాఫీ కానీ రైతన్నలకు ఏం సమాధానం చెబుతుంది ?… pic.twitter.com/QmWuYgmFmK
— KTR (@KTRBRS) December 22, 2024