హైదరాబాద్: మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు డిసెంబర్ 9 అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ అని చావునోట్లో తలపెట్టిన సంకల్పానికి దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజని చెప్పారు. తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదని స్పష్టం చేశారు. ఈ కీలక మలుపు లేకపోతే జూన్ 2 గెలుపు లేనే లేదన్నారు.
దగాపడ్డ నేల విముక్తి కోసం ఉద్యమ సారథే ప్రాణత్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరిపోసిన దీక్షా విజయ్ దివస్ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు, లక్షలాది గులాబీ సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు
స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు” కేసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ”
అని చావునోట్లో తలపెట్టిన సంకల్పానికి..
దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజుతెలంగాణ చరిత్రలో..
“నవంబర్ 29” లేకపోతే..
“డిసెంబర్ 9” ప్రకటన లేదు..
ఈ కీలక మలుపు… pic.twitter.com/GLN4TAFUYv— KTR (@KTRBRS) December 9, 2024