హైదరాబాద్ : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలంటే.. సున్నా’ అంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యలో చరిత్ర లిఖించారని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో 2014కు ముందు 67ఏండ్ల కాలంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేస్తే, గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ కొత్తగా 16 వైద్య కళాశాలలు మంజూరు చేశారు.
జిల్లాకు ఒకటి చొప్పున మరో 13 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తికావొచ్చింది. వనపర్తి, రామగుండం, జగిత్యాలలో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయి. త్వరలో కొత్తగూడెం మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం’ అని ట్వీట్ చేశారు. మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఫొటోలను సైతం కేటీఆర్ పోస్ట్ చేశారు.
Hon’ble Telangana CM #KCR Garu has scripting History in medical education
Prior to 2014, in 67 years only 5 Govt medical colleges were setup in #Telangana
In the last 8 years, 16 new Medical colleges sanctioned & 13 more to be setup making it one medical college per Dist pic.twitter.com/oeiGWeEBYB
— KTR (@KTRTRS) August 28, 2022