హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ) : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8.50 లక్షల కోట్లు అప్పు మోపిందని సీఎం రేవంత్రెడ్డి తాజా చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన వాటితో కలిపి తెలంగాణ తొలి ప్రభుత్వం పదేండ్లలో చేసిన అప్పు రూ.3.50లక్షల కోట్లే అని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పినా రేవంత్రెడ్డి అవే అబద్ధాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ చేసిన అప్పులపై కేంద్రం విడుదల చేసిన గణాంకాలను తెలంగాణభవన్లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మరోసారి విడుదల చేశారు.
లోక్సభలో ఎంపీ రఘునందన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి బీఆర్ఎస్ పాలన ముగిసే నాటికి(31 మార్చి, 2024) ప్రత్యక్ష బహిరంగ అప్పు రూ.3,50,520.39 కోట్లు మాత్రమేనని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి రూ.72వేల కోట్ల అప్పు తెలంగాణ వాటాగా వచ్చిందని, మిగతా సుమారు రూ.2.80లక్షల కోట్లు కేసీఆర్ పాలనలో చేశారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత కేసీఆర్ సరార్ హయాంలో జరిగిన అప్పులపై సీఎం రేవంత్రెడ్డి పదేపదే తప్పుడు ఆరోపణలుచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.8.50 లక్షల కోట్ల అప్పులు చేసిందనే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టంచేశారు. పరిపాలనా లోపాలను, ఆర్థిక నిర్వహణ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు ..‘గత ప్రభుత్వమే రాష్ర్టాన్ని దివాళా తీయించింది, చేతిలో పైసా లేదు’ అనే సాకులు చెబుతూ రూ.8.50 లక్షల కోట్ల అబద్ధాన్ని గోబెల్స్తరహాలో చెప్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
2004 నుంచి 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వం సేకరించిన అప్పులు కేంద్రం లోక్సభకు సమర్పించిన నివేదిక
అప్పు రకం మొత్తం అప్పు