హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించడంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుది కీలకపాత్రని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం వారు ప్రగతిభవన్లో వేర్వేరుగా మంత్రి కేటీఆర్ను కలిసి మాట్లాడారు. మునుగోడు విజయం బీఆర్ఎస్కు శుభారంభమని, కేసీఆర్ జైత్రయాత్రకు తొలిమెట్టని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధే మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించాయని చెప్పారు.
కేటీఆర్ రాజకీయ చతురత, వ్యూహాలు విజయానికి దోహదం చేశాయని.. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొంటానన్న కేటీఆర్ హామీని ప్రజలు బలంగా నమ్మారన్నారు. ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ దినదినాభివృద్ధి చెందుతున్నదని, త్వరలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్ తాజుద్దీన్బాబా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లాఖాన్, టీఆర్ఎస్ మైనార్టీ రాష్ట్ర సీనియర్ నేత ఎంకే బద్రుద్దీన్, నాయకులు పప్పూభాయ్, అతఉల్లాఖాన్, ఎండీ గౌస్, వికార్ అహ్మద్, షేక్ ఇబ్రహీం, మున్నా, షాబాజ్, ముస్తఫా తదితరులు.