ఖైరతాబాద్/కవాడిగూడ, డిసెంబర్ 28 : దివంగత ప్రజానేత పీ జనార్దన్రెడ్డి (పీజేఆర్) వర్ధంతి సందర్భంగా గురువారం ఖైరతాబాద్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పీజేఆర్ సేవలను గుర్తు చేశారు. అంతకు ముందు దోమలగూడలోని పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్రెడ్డి నివాసానికి కేటీఆర్ వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
కేటీఆర్ వెంట మాజీ హోం మంత్రి మహమూద్అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, దానం నగేందర్, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్, నాయకులు గజ్జెల నాగేశ్, ముఠా జైసింహ తదితరులు పాల్గొన్నారు.