నల్లగొండ : దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తండ్రి కానిలాల్ నాయక్(Kanilal Naik) కఅనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(KTR ) దేవరకొండలోని(Devarakonda) రవీంద్ర కుమార్ నివాసానికి చేరుకున్నారు. కానిలాల్ నాయక్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు.
అనంతరం రవీంద్ర కుమార్తో పాటు అయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గువ్వల బాలరాజు, గాదరి కిశోర్, శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, కంచర్ల కృష్ణా రెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, బాలరాజు యాదవ్, R.S. ప్రవీణ్ కుమార్, తదితరులు ఉన్నారు.