మనం కేంద్రానికి ఇచ్చింది – రూ. 3.65 లక్షల కోట్లు
కేంద్రం రాష్ర్టానికి ఇచ్చింది – రూ. 1.68 లక్షల కోట్లు
తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు మోదీని ఏదీ అడగరు. నేరుగా ఆయనను చూసుడు కూడా డౌటే. కిటికీ నుంచి చూసి వస్తరనుకుంట. ఆ నలుగురు ఎంపీలది ఒక్కో రకం. కరీంనగర్లో గెలిచినాయనకు అక్కడ్నే దిక్కులేదు. నిజామాబాద్లో గెలిచిన వ్యక్తి వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తనని బాండ్ పేపర్ ఇచ్చిండు.. ఇప్పుడు కేసీఆర్ను బూతులు తిట్టుడు తప్ప చేసిందేమీలేదు. ఆదిలాబాద్ ఎంపీ సిమెంట్ కార్పొరేషన్ ఇండియాను తెరిపిస్తనని చెప్పిండు. దాన్ని కేంద్రం అమ్ముతుంటే ఏమీ చేయడు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషినల్ ట్రీట్మెంట్ను తెలంగాణలో పెడుతున్నామని 20 రోజుల కింద చెప్పిండు. మోదీ గుజరాత్కు పోయి జామ్నగర్లో పెడుతున్నమని ప్రకటించిండు.
మా నాయకుడు మాకు సంస్కారం నేర్పిండు. నాలుక వాడుడు మొదలుపెడితే మా కంటే ఎక్కువ ఎవరూ వాడలేరు. తంబాకు బుక్కెటోడు కరీంనగర్ల గెలిచి అక్కడ పీకిందేమీ లేదు. ఆయనిప్పుడు సంగ్రామ యాత్ర అని మహబూబ్నగర్లో తిరుగుతున్నడు. ఎవనిమీద సంగ్రామ యాత? డఫ్ఫర్, బేకార్ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నరు. బీజేపీ వాళ్లకు విషం చిమ్ముడు ఒక్కటే తెలుసు. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని ఒకడు, నూకలు తినాలని ఒకడు, వడ్లు కొనేది
లేదని ఇంకోడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతరు. బీజేపీ బఫూన్ గాండ్ల పార్టీ. బుట్టాచోర్ గాళ్లు, బట్టేబాజ్ గాళ్లు చిల్లరమాటలు మాట్లాడితే సహించేది లేదు. తిరగబడి ఇరగదీయాలె. –వరంగల్ పర్యటనలో మంత్రి కేటీఆర్
వరంగల్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్న ఆదాయంతోనే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వెలుగులు నిండుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్రం నిధులతోనే తెలంగాణలో అంతా జరుగుతున్నదని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడున్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి రూ.3, 65,790 కోట్లు ఇస్తే, కేంద్రం తిరిగి రాష్ర్టానికి ఇచ్చింది రూ.1, 68, 640 కోట్లు మాత్రమేని స్పష్టం చేశారు. ఈ లెక్కలు తప్పని బీజేపీ నేతలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, పదవిని ఎడమ కాలు చెప్పు లెక్క వదులుకొని సాధారణ ఎమ్మెల్యేగా ఉంటానని సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చిన నిధులను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి బుల్డోజర్ ఉపయోగించే రాష్ర్టాలకు బీజేపీ పంపిందని ఆరోపించారు. గుజరాత్లో నడిచే బుల్లెట్ రైలుకు కూడా తెలంగాణ
పైసలు పోయాయని తెలిపారు.
బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన, రూ.188 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఆరూరి రమేశ్, దాస్యం వినయ్భాస్కర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన బేకార్, లుచ్చా పార్టీ బీజేపీ అని ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏమీ చేయని మోదీ ఎందుకు? బోడి బీజేపీ ఎందుకు? అని మండిపడ్డారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
బట్టేబాజ్గాళ్ల పార్టీ బీజేపీ
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏమయ్యాయి? మన కోచ్ ఫ్యాక్టరీ గురించి అడిగితే కొత్తగా కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసే ఆలోచన లేదని చెప్పిన కేంద్రం, 2016లో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అడగ్గానే మంజూరు చేసి 2018లోగానే పూర్తి చేసింది. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల్లో ఒక్కదానికీ జాతీయ హోదా ఇవ్వలేదు. ఇవన్నీ తెలియని కొందరు కుక్కల్లాగా సీఎం కేసీఆర్పై మొరుగుతున్నారు. ఇక్కడి బేకార్ బీజేపీ నాయకులకు ఈ అన్యాయం పట్టదు. స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్, ఇప్పుడు నాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకొనేటట్టు చేశారు. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి మన ఆత్మగౌరవాన్ని పెంచారు. సినిమాల్లో ఒకప్పుడు విలన్లకు మన యాస పెట్టేవారు. ఇప్పుడు హీరోలకు మన యాస ఉంటేనే సినిమా హిట్టవుతుంది.
అట్లుంటది మనతోని. ఎట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలె. టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమీషన్లు తీసుకొంటున్నారు. వారి వేధింపులు భరించలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. మఠాల నుంచి కూడా బీజేపీ కమీషన్లు దండుకొంటున్నది. తెలంగాణ నుంచి గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు మోదీని ఏదీ అడగరు. నేరుగా ఆయనను చూసుడు కూడా డౌటే. కిటికీ నుంచి చూసి వస్తరనుకుంట. ఆ నలుగురు ఎంపీలది ఒక్కో రకం. కరీంనగర్లో గెలిచినాయనకు అక్కడ్నే దిక్కులేదు. మహబూబ్నగర్ల తిరుగుతున్నడు. నిజామాబాద్లో గెలిచిన వ్యక్తి వారం రోజుల్లో పసుపు బోర్డు తెస్తనని బాండ్ పేపర్ ఇచ్చిండు.. ఇప్పుడు కేసీఆర్ను బూతులు తిట్టుడు తప్ప చేసిందేమీలేదు. ఆదిలాబాద్ ఎంపీ సిమెంట్ కార్పొరేషన్ ఇండియాను తెరిపిస్తనని చెప్పిండు. దాన్ని కేంద్రం అమ్ముతుంటే ఏమీ చేయడు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు గొప్ప శుభవార్త అని మొన్న చెప్పిండు. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషినల్ ట్రీట్మెంట్ను తెలంగాణలో పెడుతున్నామని 20 రోజుల కింద చెప్పిండు. ప్రధానమంత్రి నిన్న గుజరాత్కు పోయి జామ్నగర్లో దానిని పెడుతున్నమని ప్రకటించిండు.
తిరగబడి ఇరగదీయాలె..
తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేని కొందరు కుక్కల్లాగా మొరుగుతున్నరు. చిల్లర మల్లర నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఉండేవి కాదు. ఇప్పుడు మొరుగుతున్న కుక్కలకు, గాడిదలకు పదవులు ఎక్కడి నుంచి వచ్చినయి? వీళ్లను ఎవలు దేకెటోళ్లు? ఎవడీ రేవంత్రెడ్డి? ఎవడీ బండి సంజయ్? వీళ్ల మాటలు ఏంది? కేసీఆర్ వయసుకు గౌరవం ఇయ్యరు. ప్రజలు రెండుసార్లు సీఎంగా ఎన్నుకున్నరనే మర్యాద ఉండదు. వాళ్ల లెక్క మాకు అనరాదా? మోదీని బట్టెబాజ్, లుచ్చ అనరాదా? మా నాయకుడు మాకు సంస్కారం నేర్పిండు.
నాలుక వాడుడు మొదలుపెడితే మా కంటే ఎక్కువ ఎవరూ వాడలేరు. తంబాకు బుక్కెటోడు కరీంనగర్ల గెలిచి అక్కడ పీకిందేమీ లేదు. ఆయనిప్పుడు సంగ్రామ యాత్ర అని మహబూబ్నగర్లో తిరుగుతున్నడు. ఎవనిమీద సంగ్రామ యాత? డఫ్ఫర్, బేకార్ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నరు. బీజేపీ వాళ్లకు విషం చిమ్ముడు ఒక్కటే తెలుసు. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని ఒకడు, నూకలు తినాలని ఒకడు, వడ్లు కొనేది లేదని ఇంకోడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతరు. బీజేపీ బఫూన్ గాండ్ల పార్టీ. బుట్టాచోర్ గాళ్లు, బట్టేబాజ్ గాళ్లు చిల్లరమాటలు మాట్లాడితే సహించేది లేదు. తిరగబడి ఇరగదీయాలె. నో డౌట్.. మరో సంవత్సరం వరకు ఎలాంటి ఎలక్షన్లు లేవు. కార్యకర్తలు అలర్ట్గా ఉండాలి. వరంగల్ నుంచే మొదలుకావాలె. బీజేపీ వాళ్లతోని ఆగం కావద్దు. ఆగమైతే వాళ్లు మనల్ని మళ్లీ ఆంధ్రలో కలుపుతరు.
టీఆర్ఎస్ కార్యకర్తల పార్టీ
టీఆర్ఎస్ కార్యకర్తల పార్టీ. త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకొందాం. అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలను అందరికీ వివరించాలె. ఎమ్మెల్యేలపైనే అన్ని బాధ్యతలు పెట్టినం. టీఆర్ఎస్ పుట్టి 21 ఏండ్లయ్యింది. ఈ నెల 27 మన పార్టీ జన్మదినం. 21 ఏండ్లకు మేజర్ అవుతారు. మన పార్టీ అదే తరహాలో ఉన్నది. 21 ఏండ్ల క్రితం పరిస్థితులు ఎట్లుండె? కేసీఆర్ సాహసం చేసి ముందుకు నడిచిండు. అప్పుడు ఆయన సూపర్ స్టార్ కాదు.
రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కొడుకు కాదు. మెదక్ ఉమ్మడి జిల్లా బయట పెద్దగా తెల్వదు. రెండేండ్లపాటు తెలంగాణపై పూర్తిగా అధ్యయనం చేసి రాష్ట్ర సాధన లక్ష్యంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నడు. ఎలాంటి హంగులు లేకుండా టీఆర్ఎస్ పార్టీని పెట్టిండు. మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులం బలం లేదు. గుండె బలం, ఆత్మవిశ్వాసంతోనే గులాబీ జెండా ప్రయాణం మొదలుపెటిండు. 47 ఏండ్ల వయస్సులోనే మంత్రి, డిప్యూటీ స్పీకర్గా పని చేసిండు. ఇంకా ఎవరైనా అయితే పై హోదా పదవులు వైపు వెళ్తారు. కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయలుదేరిండు. ఉద్యమంలో ఎత్తిన జెండా దించితే రాళ్లతో కొట్టండని సాహసోపేత ప్రకటన చేసిండు. 14 ఏండ్లపాటు ఎత్తిన జెండా దించలేదు’ అని కేటీఆర్ గుర్తుచేశారు.
మీ వివక్షకు ధన్యవాదాలు!
కేంద్రంపై కేటీఆర్ వ్యంగ్యాస్ర్తాలు
తెలంగాణ పట్ల కేంద్రం వివక్షపై మంత్రి కేటీఆర్ మరోసారి భగ్గుమన్నారు. సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్రం-గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (జీసీటీఎం) అంశంపై కేంద్ర వైఖరిని తూర్పారబట్టారు. జీసీటీఎం తెలంగాణకే వస్తున్నదంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఊరించారు. కానీ, ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్లోని జామ్నగర్లో బుధవారం ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కిషన్రెడ్డి గారూ.. మీరు ఎన్పీఏ (నిరర్ధక) ప్రభుత్వంలో ఉన్నందుకు ధన్యవాదాలు. అంతర్జాతీయ సంస్థను కేంద్రం గుజరాత్కు తరలిస్తుంటే ఏం చేస్తున్నారు? తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షకు ఇది కొనసాగింపు కాదా? రాష్ర్టానికి ప్రతిష్ఠాత్మక జాతీయ సంస్థను తీసుకొచ్చినందుకు ఎన్పీఏ ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రి కిషన్రెడ్డికి అభినందనలు. ఎప్పటిలాగే గుజరాత్ ప్రధాని దానిని జామ్నగర్కు తరలించారు. తెలంగాణపట్ల మోదీ వివక్ష నిరంతరాయంగా కొనసాగుతున్నది’ అని వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.