ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రం
హైదరాబాద్, ఫిబ్రవరి 6 : రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని.. పక్షపాతానికి ప్రతిరూపమైన చిహ్నం ఆవిష్కరించిందంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్ ‘ఒక పక్షపాత చిహ్నం వచ్చి సమతామూర్తిని ఆవిష్కరించారు. ఇలాంటి దృశ్యాలు చూసి ఎకసెక్కం (వ్యంగ్యం) కూడా ఇప్పటికే కోటానుకోట్లసార్లు మరణించింది’ అని ఎద్దేవా చేశారు. ప్రధాని రాక సందర్భంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాను హోరెత్తించారు. ఈ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో నిలిచింది.