హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు వ్యంగ్యాస్త్రం సంధించారు.
‘బండి సంజయ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానే కాకుండా ఈడీ చీఫ్గా నియమించిన ప్రధానికి కృతజ్ఞతలు. దేశాన్ని నడుపుతున్న డబుల్ ఇంజిన్ మోదీ-ఈడీ అని దీనితో స్పష్టమవుతున్నది’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.