హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ పరిధిలో క్రిస్టియన్ భవన్కు ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించిం ది. క్రిస్మస్లోపే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ప్రతియేటా మాదిరి ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలను హైదరాబాద్లో ఈ నెల 21 లేదా 22 తేదీల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై మంత్రి కొప్పుల శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, క్రిస్టియన్ భవన్కు స్థలం కేటాయించాలని గతంలోనే నిర్ణ యం తీసుకొన్నదని చెప్పారు.
అనంతరం క్రిస్మస్ పర్వదినం పురసరించుకొని పంపిణీ చేయనున్న గిఫ్ట్ప్యాక్లు, దుస్తులను జిల్లాలకు విడుదల చేయడంతోపాటు క్రిస్మస్ శాంపిల్ కేకును మంత్రి కట్ చేశారు. ఈ సమీక్షలో ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, మైనార్టీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, క్రిస్టియన్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు ఏకే ఖాన్, మైనార్టీ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ శంకర్ లుక్ పాల్గొన్నారు.