హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ.. మే 11,12 తేదీల్లో యునైటెడ్ కింగ్డమ్లో నిర్వహించనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో కీలకోపన్యాసం చేయాలని మంత్రి కేటీఆర్ను ఆహ్వానించింది.
కేటీఆర్ పాల్గొనడం వల్ల సదస్సుకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని, తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని తెలుసుకొనేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. సదస్సులో భాగంగా ఎంపీ (లేబర్) సీమా మల్హోత్రా, బ్లాక్-టై సెటబ్రేషన్స్ ఆధ్వర్యంలో హౌస్ ఆఫ్ కామన్స్లో ఏర్పాటు చేయనున్న విందులో యూకే క్యాబినెట్ మంత్రితోపాటు పాల్గొనాలని కేటీఆర్ను కోరారు. యూకేలో భారత వారోత్సవాల ప్రారంభంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.