హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సుకు ముఖ్యవక్తగా హాజరు కావాలంటూ కేటీఆర్ను ఆ సంస్థ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే థీమ్తో ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకులు సిద్ధార్థ్ సేథీ తెలిపారు.
కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటే చర్చలు మరింత ఫలప్రదంగా, ఆసక్తికరంగా ఉంటాయని ఆయన తెలిపారు. దాంతో పాటు భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో భాగం కావడానికి వారందరికీ స్ఫూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలను పరిషరించడంతోపాటు భారత్లో స్థిరమైన అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై ఈ సదస్సులో పాల్గొనే వక్తలు ప్రధానంగా చర్చిస్తారని సేథీ పేర్కొన్నారు.
వివిధ దేశాల విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణులు, పూర్వ విద్యార్థుల సమక్షంలో భారతదేశ ప్రగతి పథాన్ని, తెలంగాణలో అమలుచేసిన వినూత్న విధానాలను, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి మోడల్ను కేటీఆర్ వివరించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో కేటీఆర్ పాల్గొనడం వల్ల రాబోయే రోజుల్లో ప్రపంచంపై ఇండియా చూపే సానుకూల ప్రభావాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి బలంగా చాటవచ్చన్న అభిప్రాయాన్ని సిద్ధార్థ్ సేథీ వ్యక్తపరుస్తూ ఈ ఆహ్వానాన్ని స్వీకరించి, సదస్సుకు రావాలని కోరారు.
ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సమావేశం యూరప్లో భారత్కు సంబంధించిన అతి పెద్ద కార్యక్రమం. భారతదేశ పురోగతి, ఆవిషరణలను ప్రపంచానికి చాటిచెప్పే వేదిక. మనదేశ అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న మార్పులు, గ్లోబల్ సహకార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. భారత్ను ప్రపంచానికి దగ్గర చేయడం, పరిశోధన, సాంకేతికత, విధానాల్లో ఇతర దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ ఫోరమ్ ప్రధాన లక్ష్యం.