KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్టుగా మూసీ వద్ద మూడు నెలలు కాదు.. మూడేండ్లు ఉంటే పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాగోల్లోని సీవరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పుడే మూసీకి సమీపంలో ఉండే నింబిలి అడ్డా, మొజాంజాహీ మార్కెట్ వద్ద ఉన్నానని చెప్పారు. అనుమతులు తీసుకొని, పన్నులు క ట్టిన పేదలను కబ్జాకోరులుగా చిత్రీకరించడంపై మండిపడ్డారు. పేదల ఇండ్లను కూల్చివేసి, బస్టాండ్, మెట్రో స్టేషన్ ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. మూసీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, ఇండ్లను కోల్పోతున్న పేదలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉం టుందని స్పష్టం చేశారు. మూసీ వెంబడి ఇండ్ల ను కోల్పోతున్నవారికి అండగా నిలుస్తూ వారి తరఫున రాజ్యాంగ, న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని, ఇప్పటికే 500 మందికి ఊరటనిచ్చే లా హైకోర్టులో స్టే ఆర్డర్లు వచ్చాయన్నారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్, ఎస్టిమేషన్ లేనప్పుడు పేదల ఇండ్లను ఎందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు. ఇండ్లు ఖాళీ చేయాలంటున్న అధికారులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పేదలను ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ సహించబోదని హెచ్చరించారు.
సీం కేసీఆర్ హయాంలోనే మూసీ బాగు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు మూసీని మురికి కూపంలా మార్చితే, స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మూసీని సుందరీకరణ చేపట్టినట్టు చెప్పారు. ఎస్టీపీలను సక్రమంగా నడిపితే నల్లగొండ జిల్లాకు పరిశుభ్రమైన నీరు వెళ్తుందని తెలిపారు. దక్షిణాసియాలోనే మొదటగా వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్ నిలిచిందని, ఇది కేసీఆర్ ఘనతేనని స్పష్టం చేశారు. గతంలోనే రూ. 3800 కోట్ల ఖర్చుతో ఎస్టీపీలను నిర్మించామని తెలిపారు. నగరంలో 57.5 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీకి పునరుజ్జీవం తేవాలంటే ముందుగా నీటిని శుద్ధి చేయాలని అప్పటి సీ ఎం కేసీఆర్ సంకల్పించారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ మూసీ ద్వారా నల్లగొండకు మురుగు నీరు పంపితే, బీఆర్ఎస్ హయాంలో శుద్ధజలాలను పంపించే ప్రణాళికలను అమలు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ కట్టిన ఇండ్లకు సున్నం వేసి కట్టిన గుంపు మేస్త్రీని తానేనని సీ ఎం రేవంత్రెడ్డి చెప్పుకొంటున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మూసీని శుద్ధి చేసేందుకు కొం డపోచమ్మ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను మూసీ నదికి అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. దీనికి 2023లోనే రూ. 1100 కోట్లతో మూసీ అనుసంధాన ప నులు చేపట్టినట్టుగా చెప్పారు. ఇక ఎస్టీపీలు, బ్రిడ్జిలు, గోదావరి అనుసంధానంతో మూసీకి పునరుజ్జీవం పోసిందే బీఆర్ఎస్ అని మరోసా రి స్పష్టం చేశారు. మూసీ డెవలప్ అథారిటీ చై ర్మన్గా సుధీర్రెడ్డి ఉన్నప్పుడే పనులన్నీ దా దాపు పూర్తి చేశామని తెలిపారు. అన్నింటికీ కలిపినా రూ. 25వేల కోట్లతో మూసీకి పూర్వ వైభ వం వస్తుందని స్పష్టం చేశారు.
చందాలిస్తాం.. సీఎం కుర్చీ కాపాడుకో
సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడుకునేందుకు కావాలంటే చందాలు వేసి నిధులు సమకూర్చుతామని ఎద్దేవా చేశారు. పేదల ఇండ్లను కూల్చి, అవినీతి మూటలు ఢిల్లీకి తరలిస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 2400 కిలోమీటర్ల పొడవైన నమామి గంగే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ రూ. 40వేల కోట్లు ఖర్చు చేశారని, మూ సీ కోసం కిలోమీటర్కు రూ. 2700 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
బ్యూటీఫికేషన్కు కాదు.. లూటిఫికేషన్కు వ్యతిరేకం
మూసీ బ్యూటీఫికేషన్కు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని, పేదలను రోడ్డుపై పడేసే లూటిఫికేషన్కు మాత్రమే తాము వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. బఫర్జోన్లో అనుమతులతో ఇండ్లు కట్టుకున్నవారిని కబ్జాదారులని సీఎం రేవంత్రెడ్డి ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. లక్ష మందిని రోడ్డున పడేసి, కోట్లాది రూపాయలు దోచుకుంటామంటే బీఆర్ఎస్ ఎలా మద్దతునిస్తుందని ఆయన ప్రశ్నించారు. మూసీ పేరి ట లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని సీఎంను ప్రశ్నించారు. అవసరమైతే రెండు దిక్కుల కరకట్టలు కట్టి, ఎవరికీ నష్టం లే కుండా చేయాలని గానీ, బఫర్ జోన్ జోలికి వెళ్లకూడదని ప్రభుత్వానికి సూచించారు. పేదల ఇండ్లు కూల్చి, వారిని రోడ్డున పడేసి కట్టే మాల్స్ ఎందుకని ప్రశ్నించారు. ప్రభు త్వ దూకుడును తప్పుబట్టారు.