KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి విమానంలో వెళ్లారు. ఇవాళ ఉదయం తెలంగాణ భవన్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం ఎయిర్పోర్ట్కు చేరుకొని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్. https://t.co/kefI82y312 pic.twitter.com/l1AizmzHJa
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2024