KTR | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): పారిశుద్ధ్య కార్మికుల గౌరవాన్ని పెంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుసార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందని గుర్తు చేశారు. సోమవారం ఆయన తెలంగాణభవన్లో నూతన సంవత్సర వేడుకలను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జరుపుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు.
కేటీఆర్తో పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టణాలు, పల్లెల పరిశుభ్రతలో అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో నూ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చా రు. జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు తాము ఎదురొంటున్న సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. జీతాల పెంపుతోపాటు అరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
కేటీఆర్కు శుభాకాంక్షల వెల్లువ
తెలంగాణభవన్లో కేటీఆర్కు పలువురు నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ను కలిసినవారిలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటి ల్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భేతి సుభాష్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, పైళ్ల శేఖర్రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, ఆశన్నగారి జీవన్రెడ్డి, చిరుమర్తి లింగయ్య,
దాస్యం వినయ్భాస్కర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రాజీవ్సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, రజిని సాయిచంద్, గజ్జెల నగేశ్, నందికంటి శ్రీధర్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పార్టీ నాయకులు జీ రాజేశంగౌడ్, కంచర్ల చంద్రశేఖర్రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, పల్లా ప్రవీణ్రెడ్డి, దరువు ఎల్లన్న, తలసాని సాయికిరణ్, సుధాకర్రెడ్డి, ఆటో యూనియన్ నేత వేముల మారయ్య, విద్యార్థి నాయకులు ఉన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలతో కేటీఆర్ సంభాషించారు.