హైదరాబాద్: పైసా పనిలేదు, రాష్ట్రానికి రూపాయి లాభం లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శనాస్త్రాలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు ఢిల్లీకి పోయివస్తివి అంటూ విరుచుకుపడ్డారు. పోను 25 సార్లు, రాను 25 సార్లు.. నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్జూబ్లీ కూడా చేస్తివని ఎద్దేవా చేశారు. తట్టా మట్టి తీసింది లేదు, కొత్తగా చేసింది అసలే లేదంటూ విమర్శించారు. అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని, గురుకులాలు గాల్లో దీపాల్లా మారాయని, వైద్యం కుంటుపడిందని, విద్యావ్యవస్థ గాడి తప్పిందన్నారు.
మూసి, హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టారని, 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలు పండగళ్లా లేవని, ఆడబిడ్డలకు చీరలు అందనేలేవని, అవ్వాతాతలు అనుకున్న పింఛను, తులం బంగారం జాడే లేదని ఫైరయ్యారు. స్కూటీలు, కుట్టు మిషిన్లు లేనేలేవని, అయినా ఢిల్లీకి పోయిరావాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు.
‘‘పైసా పనిలేదు – రాష్ట్రానికి రూపాయి లాభం లేదు
10 నెలలు – 25 సార్లు – 50రోజులు
పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు
అయినను పోయి రావాలె హస్తినకు
అన్నదాతల అరిగోసలు
గాల్లో దీపాల్లా గురుకులాలు
కుంటుపడ్డ వైద్యం
గాడి తప్పిన విద్యా వ్యవస్థ
అయినను పోయి రావాలె హస్తినకు
మూసి పేరుతో – హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి – 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి
అయినను పోయి రావాలె హస్తినకు
పండగలు పండగళ్ళా లేవు ఆడబిడ్డల చీరలు అందనేలేవు అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదు తులం బంగారం జాడనే లేదు స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు
అయినను పోయి రావాలె హస్తినకు’’ అంటూ సీఎం
✳️ పైసా పనిలేదు – రాష్ట్రానికి రూపాయి లాభం లేదు
10 నెలలు – 25 సార్లు – 50రోజులు
పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు
❌ అయినను పోయి రావాలె హస్తినకు
✳️…
— KTR (@KTRBRS) October 17, 2024