ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 20 : మూడేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలి చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మందాటి కొమురయ్య మూడేండ్ల క్రితం మృతిచెందారు. ఇటీవల కొమురయ్య కూతురు అంజలికి వివాహం నిశ్చయమైంది. సోమవారం ఎల్లారెడ్డిపేటలో ఆమె వివా హం జరుగగా, సమాచారం తెలుసుకొన్న మంత్రి కేటీఆర్ ఆర్థికసాయం అందించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జి తోట ఆగయ్య, మంత్రి పీఏ కుంబాల మహేందర్రెడ్డితో కలిసి అంజలికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి నవ వధువుకు పుస్తెమట్టెలను వితరణ చేశారు. ఈ సందర్భంగా కొమురయ్య కుటుంబీకులు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.