హైదరాబాద్ : ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎంపీలు మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసిన ఎంపీలు ఒకరికొకరు తినిపించుకున్నారు. హ్యాపీ బర్త్ డే కేటీఆర్, హ్యాపీ బర్త్ డే రామన్న అంటూ ఎంపీలు నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీలు సంతోష్ కుమార్, కేకే, నామా నాగేశ్వరరావు, దామోదర్ రావు, కేఆర్ సురేష్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పార్థ సారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, రాములు, మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.