KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద క్రీడాకారిణికి అండగా నిలబడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన స్వతహాగా ఎదిగింది. ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ నుంచి శ్రీలంకలో పారా త్రోబాల్ ఆడటానికి అర్హత సాధించింది.
పేద కుటుంబానికి చెందిన అర్చనకు చిన్నతనం నుంచే క్రీడలంటే ఆసక్తితోనే ఎంత కష్టమొచ్చినా ఈ స్థాయికి వచ్చింది. అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తనకు ఇష్టమైన ఆటలో గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నది. అయితే ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలుసుకున్నారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చి, ఆమెకు ఆటకు సంబంధించిన క్రీడా పరికరాలు, ఆర్థికసాయం చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు.
రామన్న భరోసా ❤️
అన్నా అంటే చాలు..
నేనున్నానంటూ భుజం తట్టి ప్రోత్సాహిస్తాడు.రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ… https://t.co/Vjzaimft7r pic.twitter.com/mrI21wBFNe
— BRS Party (@BRSparty) October 19, 2025