హైదరాబాద్ : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) , మాజీ మంత్రులు హరీష్రావు( Harish Rao ) , జగదీష్రెడ్డి, ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన వేములను సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, అనిల్ జాదవ్ తదితరులున్నారు.