తెలంగాణలో పెట్టుబడుల వరద పారించేందుకు చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వారం పర్యటనలో 35 బిజినెస్ మీటింగ్లు నిర్వహించామన్నారు. నాలుగు సెక్టార్ రౌండ్టేబుల్స్లో పాల్గొన్నామని పేర్కొన్నారు.
3 అతిపెద్ద ఈవెంట్స్లో భాగస్వాములమయ్యామని మంత్రి కేటీఆర్ వివరించారు. మొత్తంగా ఈ పర్యటనలో రూ. 7,500కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు పేర్కొన్నారు. పర్యటన విజయవంతానికి తనకు సహాయసహకారాలు అందించిన బృంద సభ్యలుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తమకు అమెరికాలో సాదరస్వాగతం పలికిన ఎన్నారైలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.