KRMB | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి 4.73 టీఎంసీల నీటిని వాడుకున్నట్టు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వెల్లడించింది. అక్టోబర్లో జరిగిన త్రిసభ్య కమిటీ స మావేశ నిర్ణయం ప్రకారం తెలంగాణకు 35 టీ ఎంసీలను కేటాయించగా.. ఇప్పటికే సాగర్ నుంచి 15.38 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 26.57 టీఎంసీలను వినియోగించుకున్నట్టు వివరించింది.
ఈ మేరకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు లేఖ రాసింది. తెలంగాణ తాగునీటి అవసరాల కో సం ఈ ఏడాది మే చివరి వరకు 8.90 టీఎంసీ లు అవసరమవుతాయని, క్యారీఓవర్ స్టోరేజీ, తాగునీటి కేటాయించిన జలాల్లో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయపురే ఈ లేఖను రాశారు. క్యారీఓవర్ స్టోరేజీ అం శాన్ని ట్రిబ్యునల్కు అప్పగించామని, తాగునీటి వినియోగంలో 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై బోర్డు సమావేశంలో ఏకాభిప్రాయం కుదరనందున నిర్ణయం తీసుకోలేదని ఆ లేఖలో స్పష్టం చేశారు.