హైదరాబాద్ : నాగార్జునసాగర్ డ్యామ్ను(Nagarjunasagar Dam) కేఆర్ఎంబీ బృంద సభ్యులు(KRMB team) గురువారం సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వర్షకాలానికి ముందు నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతు పనులు చేపట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో కేఆర్ఎంబీ రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.