హైదరాబాద్, ఫిబ్రవరి 4 : కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్కమిటీ బృందం ఈ నెల 16న పులిచింతల ప్రాజెక్టును సందర్శించనున్నది. గెజిట్ అమలులో భాగంగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ రివర్బోర్డు పరిధిలోకి వెళ్లనున్నది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే కేఆర్ఎంబీ సబ్కమిటీ నెట్టెంపాడు, శ్రీశైలం, నాగార్జునసాగర్, ఇటీవల జూరాల, ఆర్డీఎస్, సుంకేశుల తదితర ప్రాజెక్టులను సందర్శించింది. తాజాగా పులిచింతలతోపాటు ప్రకాశం బరాజ్, కృష్ణాడెల్టాలోని పలు కాంపోనెంట్లను సందర్శించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు సమాచారం అందజేసినట్టు తెలిసింది.