విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీని నియమించింది. కేఆర్ఎంబీ సభ్యుడు బీ రవికుమార్ పిైళ్లె ఈ కమిటీకి కన్వీనర్గా వ్యవహరించనున్నారు. కమిటీ సభ్యులుగా కేఆర్ఎంబీ మెంబర్ ఎల్బీ మాంథంగ్ , తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సీ నారాయణరెడ్డి, టీఎస్ జెన్కో డైరెక్టర్ (హైడల్) సీహెచ్ వెంకటరాజం, ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ ఎం. సంజయ్కుమార్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు కేంద్రజల్శక్తి మంత్రిత్వశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.