హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని ఏపీ వినియోగించుకునేందుకు కేఆర్ఎంబీ అంగీకరించింది. ఈ మేరకు ఏపీకి కేఆర్ఎంబీ శుక్రవారం లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అంశంపై గత అక్టోబర్లో నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశం అప్పటికి అందుబాటులో ఉ న్న జలాల్లో 35 టీఎంసీలను తెలంగాణ కు, 45 టీఎంసీలను ఏ పీకి కేటాయించిన విషయం తెలిసిం దే. గత నెలలో నాగార్జునసాగర్ నుం చి 5 టీఎంసీలను ఇవ్వాలని ఏపీ కేఆర్ఎంబీకి ఇండెంట్ పెపట్టడంతో తాజాగా ఆమోదం తెలిపింది.
అభిప్రాయం చెప్పండి
గోదావరి బేసిన్లో చేపట్టిన పలు ప్రా జెక్టులను బోర్డు సమావేశంలో చేర్చాలన్న ఏపీ ప్రతిపాదనలపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణ సర్కారుకు జీఆర్ఎంబీ సూచించింది. ఈ మేరకు శుక్రవారం ప్ర త్యేకంగా లేఖ రాసింది. సమావేశంలో చ ర్చించాల్సిన అంశాలను ఇరు రాష్ర్టాలు జీ ఆర్ఎంబీకి ప్రతిపాదించాయి. గతంలో ప్రతిపాదించిన అంశాలతోపాటు అదనం గా మరికొన్ని అంశాలను బోర్డు సమావేశంలో చేర్చాలని ఏపీ ఇటీవలే బోర్డుకు లేఖ రాసింది.