హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఈ నెల 8 నుంచి ఢిల్లీలో విచారణ ప్రారంభించనున్నది.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005 టీఎంసీలతోపాటు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేసేందుకు ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 89 ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారణ జరిపి ప్రాజెక్టుల వారీగా నీటిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్లో నూతన మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.