హైదరాబాద్ : ఈ నెల 27న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. ఈ మేరకు సమావేశానికి హాజరుకావాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ నోటీసులు జారీ చేసింది. సమావేశ అజెండాను నోటీసులకు జతపరిచింది. కృష్ణాజలాల్లో రాష్ట్రాల వాటా, అజెండాలో బోర్డు పరిధి, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం, విద్యుత్ అంశాలు, చిన్ననీటిపారుదల వనరులు, గోదావరి జలాల మళ్లింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తున్నది.