హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు నిధులు కరువయ్యాయి. బోర్డు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొన్నది.
ఈ నేపథ్యంలో బడ్జెట్ విడుదలకు సంబంధించి ఇరు రాష్ర్టాలతో 22వ తేదీన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.