హైదరాబాద్ : రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. తుఫాను ప్రభావం, పోలవరం పనుల వల్ల సమావేశానికి హాజరు కాలేమని ఏపీ తెలిపింది. దీంతో ఏపీ ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు వీడియో కాన్ఫరెన్స్ ను వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. సమావేశ తదుపరి తేదీని త్వరలోనే తెలుపుతామని కృష్ణా బోర్డు వెల్లడించింది.