హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): వానకాలంలో తెలంగాణ వ్యవసాయ అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 8.5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కేఆర్ఎంబీ ఆమోదం తెలిపింది. 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం.. తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ కోరింది.
ప్రస్తుతం సాగర్లో కేవ లం 12.73 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉండటంతో తెలంగాణకు 8.50 టీఎంసీలు, ఏపీకి 4.20 టీఎంసీల నీరు విడుదలకు ఆమోదం తెలిపింది.