ఖైరతాబాద్, జనవరి 17: కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరిపీఠం ఆధ్వర్యంలో జగద్గురు సిద్ధేశ్వరానందభారతి మహాస్వామి 88వ అవతరణోత్సవం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 21 నుంచి 28 వరకు 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగాన్ని నిర్వహిస్తామని పీఠం ధర్మాధికారి వల్లూరు శివకోటేశ్వర్రావు తెలిపారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఈ క్రతువుకు సంబంధించిన బ్రోచర్లను పీఠం కార్యదర్శి మునిపల్లె శ్రీనివాస్, దర్శనం పత్రిక ఎడిటర్ మరుమాముల వెంకటరమణశర్మతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. హైదరాబాద్లోని ఎన్టీఆర్స్టేడియం వేదికగా 25 వేల కేజీల ఎండు మిరపకాయలతో ఈ మహాక్రతువు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు యాగశాల కలశ మండప పూజలు, 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కోటి ప్రత్యంగిరాయాగం, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీ లలిత, విష్ణు, సౌందర్యలహరి పారాయణం, రాత్రి 7 గంటల నుంచి జగద్గురు సిద్ధేశ్వరానందభారతి మహాస్వామి అనుగ్రహభాషణం ఉంటుందని చెప్పారు.