కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు సీపీఐ కౌన్సిలర్లు బుధవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు విజయకుమార్, సత్యనారాయణచారి, మాచర్ల రాజకుమారి, నేరెళ్ల సమైక్య తదితరులు చేరారు. వనమా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి వారికి సూచించారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ