ప్రభుత్వ దవాఖాల్లో కనీస వసతులు కల్పించాలని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్రెడ్డి వైద్యశాఖకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. జిల్లా వైద్యశాలల్లో ఎంఆర్ఐ, సీటీ స్కాన్, వెంటిలేటర్లు.. తదితర వసతులు కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ వైద్యశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ తొలుత వైద్యశాలల్లో కనీస వసతులు కల్పించాలని కోరారు. ఇందుకు కోరుట్ల, మెట్పల్లి వైద్యశాలల పరిస్థితిని ఉదహరించారు.