ఉప్పల్, డిసెంబర్ 12: సబ్బండవర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉప్పల్ భగాయత్లో రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న క్రిస్టియన్ భవనకు సోమవారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్టియన్ భవన నిర్మాణానికి రూ.70 కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని కేటాయించడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల్ భగాయత్లో నిర్మించనున్న భవనాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారన్నారు. ఎమ్మెల్సీలు రాజేశ్వర్రావు, స్టీఫెన్సన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్గుప్తా, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్, పలువురు కార్పొరేటర్లు, క్రైస్తవ ప్రతినిధులు పాల్గొన్నారు.