హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలోని ప్రవాసులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్న మంత్రి కొప్పుల.. పనెన్స్ సిటీలో బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ రాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రవాసులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను కోరారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని, అమెరికాలోని సంస్థలు కూడా ప్రభుత్వానికి తోడుగా తెలంగాణకు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా సహకరిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పది రోజుల అమెరికా పర్యటనలో భాగంగా కొప్పుల ఇప్పటికే సాల్ట్ లేక్ సిటీలోని LDS హ్యుమానిటేరియన్ సెంట్రల్ వేర్హౌస్ రూట్స్ టెక్ను సందర్శించారు. సాల్ట్ లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ సభ్యులతోనూ మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా వారు మంత్రిని
శాలువా కప్పి సత్కరించారు.