హైదరాబాద్, జనవరి21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో బీసీలు, ఎంబీసీలు, సంచార జాతుల సంక్షేమానికి జనాభా దామా షా ప్రకారం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లలో వ్యక్తిగత రుణాలతోపాటు, బీసీ కులాల ఫెడరేషన్లలో కుల వృత్తిదారులకు ఆయా సొసైటీల ద్వారానే నిధులు మంజూరు చేయాలని, అత్యంత వెనకబడిన కులాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని డి కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్ల సంఖ్యను పెంచాలని సత్యనారాయణ కోరారు.