హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): బీహార్ రాష్ట్రంలో చేపట్టిన కులగణన తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కులగణన నిర్వహించి, బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో బీహార్ తరహాలో వెంటనే కులగణన చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నోటిఫికేషన్ రాకముందే బీసీల రిజర్వేషన్లను పెంచాలని కోరారు.