చేర్యాల, ఫిబ్రవరి 15: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు రైల్వే ప్రయాణ సౌకర్యం కల్పించాలని నాటి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారు. అందుకోసం ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిబంధనల ప్రకారం.. ఈ స్టేష న్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభు త్వం చెరిసగం ఖర్చు భరించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద కేసీఆర్ నిధులు కేటాయించారు. భూ సేకరణ విషయమై రైతులతో పలు దఫాలుగా చర్చలు జరిపి ఒప్పించారు. ఈ విధంగా రైల్వేస్టేషన్కు సరిపడా భూమిని కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయినా.. కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం విషయంలో ఇప్పటివరకూ ముందుకు రాని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నందున.. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణం అంటూ హడావిడి చేస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బీజేపీ మంత్రులు, నాయకులు ఈ క్రెడిట్ను తమ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, గురువారం మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్, దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్కుమార్జైన్ తదితరులతో కలిసి కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్యాదవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కొమురవెల్లి రైల్వేస్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి రావ డం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దేశంలో రైల్వేల ఆధునీకరణ కోసం మోదీ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని చెప్పారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. కొమురవెల్లి కొండ ప్రాంతం కాబట్టి రైల్వేస్టేషన్ నిర్మాణానికి అనుకూలంగా లేదని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని, కా నీ.. మల్లన్న దర్శనం కో సం వచ్చే భక్తుల సౌకర్యార్థం మల్లన్న పా దాల చెంత రైల్వేస్టేషన్ నిర్మించాలని తాను ప్రధాని మో దీకి వివరించడంతో ఇక్కడ స్టేషన్ మంజూరైందని చెప్పారు. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, రూ.720 కోట్లతో సికింద్రాబాద్, రూ.350 కోట్లతో నాంపల్లి, రూ.450 కోట్లతో కాచిగూడ రైల్వేస్టేషన్, కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ను నిర్మిస్తున్నామని తెలిపారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్ నుంచి మల్లన్న ఆలయం వరకు పక్కా రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజారాధకృష్ణశర్మ, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.