చేర్యాల, డిసెంబర్ 7: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం(Mallanna temple)లో ఈ నెల 11వ తేదీన హుండీ(hundi )లను విప్పి నగదును లెక్కించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న నిర్వహించాల్సిన హుండీ లెక్కింపు ఉన్నతాధికారులు ఆదేశాలతో వాయిదా( Postponed) పడడంతో తిరిగి 11న నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలను ఓపెన్ చేసి భక్తులు స్వామి వారికి సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలు లెక్కించనున్నట్లు తెలిపారు. అలాగే స్వామి వారికి మొక్కుల రూపంలో చెల్లించుకున్న బియ్యం, పసుపును తూకం వేయనున్నట్లు పేర్కొన్నారు. స్వామి వారి హుండీ లెక్కింపులకు పాలక మండలి, పోలీస్, రెవెన్యూ అధికారులు, బ్యాంకు అధికారులతో పాటు ఆహ్వానం అందుకున్న ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరుకావాలన్నారు.