చేర్యాల, ఫిబ్రవరి 27 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి(Mallanna temple) వారి 7వ ఆదివారం సందర్భంగా రూ.36,13,367 ఆదాయం(Hundi income,) వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ.2,82.975, ఆదివారం రూ.29,44,170, సోమవారం రూ.3,86,222 ఆదాయం వచ్చిందన్నారు. వారితో పాటు ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, కమిటీ సభ్యులు, అర్చకులు, ఒగ్గు పూజారులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.