Minister Komatireddy | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కార్లో ఏ మంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. ఏ వ్యాఖ్య చేసినా అది చర్చనీయాంశంగా మారుతున్నది. తాజాగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం తన ట్విట్టర్(ఎక్స్)లో చేసిన పోస్ట్ ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో సంచలనానికి తెరతీసింది.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో తాను కలిసున్న ఫొటోను బ్యాక్గ్రౌండ్లో ‘కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం’ అన్న క్యాప్షన్తో పోస్ట్ చేశారు. గ్రాఫిక్ చేసిన ఈ ఫొటోలో బ్యాక్గ్రౌండ్లో ప్రభుత్వ లోగోతో పాటు సచివాలయ చిత్రం కూడా ఉండటం గమనార్హం. ఈ పోస్ట్ను భట్టి విక్రమార్కకు ట్యాగ్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కొద్ది సమయంలోనే వైరల్గా మారింది. కోమటిరెడ్డి చేసిన పోస్ట్లోని కొత్త శకాన్ని నిర్మిద్దాం అనే వ్యాఖ్యపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.
కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం…#KomatiReddyVenkatReddy #BhattiVikramarkaMallu #TelanganaPrajaPrabhutwam@Bhatti_Mallu @INCTelangana pic.twitter.com/suzRsjMIrA
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 30, 2023