MLA Rajagopal Reddy | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మనసులోని మాటను బయపెట్టారు. తనకూ మం త్రి పదవి కావాలని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి తనను వెతుక్కుని వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అన్నయ్య వెంకటరెడ్డికి వస్తే ఏంటని.. తనకూ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్న తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేస్తే.. తాను తెలంగాణ కోసం పార్లమెంటులో పోరాటం చేశానని గుర్తు చేశారు. సమర్థులైనప్పుడు ఇద్దరికీ ఇవ్వొచ్చని పేర్కొన్నారు. కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని కాబట్టి మంత్రివర్గంలో తనకూ స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నానని రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు.