నల్లగొండ : మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. వృద్ధులపై నోరు పారేసుకున్నారు. వృద్ధులను అగౌరవ పరిచే విధంగా మాట్లాడారు. ఎక్కడి ముసలొల్లు రా నాయనా.. అంటూ కోపం చేశారు రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సందర్భంగా.. వృద్ధుల నుంచి రాజగోపాల్ రెడ్డికి తీవ్ర నిరసన ఎదురైంది. ఆసరా పెన్షన్లతో అండగా నిలుస్తున్న కేసీఆర్కే వృద్ధులంతా జై కొట్టారు. దీంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎక్కడి ముసలొల్లు రా నాయనా.. ఎక్కడ వోయిన మనం సస్తున్నాం. ముసలొల్లు చేయవట్టే ఆ కారు గుర్తు రెండు సార్లు వచ్చింది. అవునా? కాదా? అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అలా వృద్ధులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవమానించారు.
ఎక్కడి ముసొలోల్లురా నాయిన మీరు ఓట్లు వెయ్యబట్టి టీఆర్ఎస్ రెండు సార్లు వొచ్చింది అని ఓట్లు వేసిన ముసొలోల్లని అవమానిస్తున్న @krg_reddy ..#MunugodeBypoll #MunugodeWithTRS#MunugodeWithKCR @KTRTRS pic.twitter.com/oGTwj7QOBi
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) October 13, 2022