హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్న సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్ ఖాతాలను సీజ్ చేసి, సమగ్ర విచారణ జరపాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం చండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓట్ల కొనుగోలు కోసం బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్ ఖాతాల నుంచి నియోజక వర్గంలోని పలువురి వ్యక్తిగత ఖాతాలకు భారీ మొత్తంలో నగదు బదిలీ చేశారని వారు పేర్కొన్నారు. నగదు బదిలీ చేసిన 36 మంది పేర్లు, చిరునామా, బ్యాంక్ ఖాతా నంబర్లు, బ్యాంక్ వివరాలను టీఆర్ఎస్ నేతలు పోలీసులకు అందజేశారు.