హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశానికి నూతన దిక్సూచిగా అనేక విప్లవాత్మకమైన పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రజావ్యతిరేకి అని అమిత్ షా మాట్లాడటం ఆయన అవగాహన రాహిత్యానికి, కళ్లుండీ చూడలేని కబోధితనానికి నిదర్శనమని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మండిపడ్డారు. ఆదిలాబాద్ సభలో అమిత్ షా అన్నీ అసత్యాలే మాట్లాడారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని, పసలేని ప్రసంగం చేశారని ఆక్షేపించారు.
తెలంగాణ ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ ఓడిపోవడం ఖాయమని చెప్పారు. తమ పాలనలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఏం చేసిందో చెప్పుకోలేని స్థితిలో ఉన్నదని విమర్శించారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నట్లు కోలేటి స్పష్టంచేశారు.